ఐపీఎల్ 2020 ద్వారా బీసీసీఐకి కళ్లు చెదిరే ఆదాయం... స్టేడియానికి జనాలు రాకపోయినా...
First Published Nov 23, 2020, 10:55 AM ISTIPL 2020... ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే ఐపీఎల్ 2020 సీజన్ చాలా ప్రత్యేకమైనది. కరోనా విపత్కర పరిస్థితులను ఎదుర్కొని, ఐపీఎల్ నిర్వహించడం ఒక ఎత్తైతే, ఖాళీ స్టేడియాల్లో జరిగిన ఈ సీజన్ సూపర్ సక్సెస్ కావడం మరో ఎత్తు. అనేక అడ్డంకులు దాటుకుని ఐపీఎల్ 2020 సీజన్ను నిర్వహించిన బీసీసీఐకి, ఏకంగా 4 వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందట. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ దుమాల్.