నేను కెప్టెన్‌గా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు... ముంబై కాకుండా ఏ టీమ్ అయినా... రోహిత్ శర్మ కామెంట్స్...

First Published Nov 22, 2020, 6:58 PM IST

ఐపీఎల్2020 విజయం రోహిత్ శర్మకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. రోహిత్ శర్మకు భారత టీ20 కెప్టెన్సీ ఇవ్వాల్సిందేనని కొందరు పట్టుబడుతుంటే... మరికొందరు మాత్రం రోహిత్ శర్మకు దొరికిన జట్టు గట్టిది కాబట్టే విజయాలు దక్కుతున్నాయని కామెంట్ చేస్తున్నారు. భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, క్రికెట్ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా వంటి వాళ్లే ముంబై ఇండియన్స్ కాకుండా మరో జట్టును రోహిత్ శర్మ నడిపించలేడని కామెంట్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ వ్యాఖ్యలపై స్పందించాడు రోహిత్ శర్మ.

కెరీర్ ఆరంభంలో డెక్కన్ ఛార్జర్స్ జట్టులో సభ్యుడైన రోహిత్ శర్మ, 2011 నుంచి ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడుతున్నాడు. 2013లో రికీ పాంటింగ్ నుంచి సారథ్య బాధ్యతలు తీసుకున్న రోహిత్ శర్మ... గత 8 సీజన్లలో ఐదు సార్లు టైటిల్ గెలిచాడు.
undefined
ఈ విజయాలతో భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్... ‘రోహిత్ శర్మకు భారత జట్టు కెప్టెన్సీ ఇవ్వకపోతే టీమిండియా చాలా నష్టపోతుంది. ఎనిమిది సీజన్లుగా ఒక్క టైటిల్ గెలవలేకపోయిన విరాట్ కోహ్లీ కంటే అదే టైమ్‌లో ఐదు టైటిల్స్ గెలిచిన రోహిత్ బెస్ట్ కెప్టెన్’ అంటూ వ్యాఖ్యానించాడు...
undefined
ఈ వ్యాఖ్యలతో విరాట్ కోహ్లీపై ట్రోలింగ్ మొదలైంది. దీనిపై స్పందించిన భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్... ‘రోహిత్ శర్మ స్ట్రాంగ్ కెప్టెన్ కాదు, స్ట్రాంగ్ టీమ్‌కి కెప్టెన్... ముంబై ఇండియన్స్ జట్టులో అందరూ మ్యాచ్ విన్నర్లు సభ్యులుగా ఉన్నారు’ అంటూ కామెంట్ చేశాడు.
undefined
‘ముంబైలాంటి పటిష్ట జట్టు ఉంటే ఏ కెప్టెన్ అయినా టైటిల్ గెలవగలడు. ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌తో రోహిత్ శర్మ టైటిల్ సాధించగలడా?’ అంటూ గంభీర్‌ను సూటిగా ప్రశ్నించాడు మాజీ క్రికెటర్, క్రికెట్ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.
undefined
ఈ వ్యాఖ్యలపై తాజాగా స్పందించాడు ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ... ‘ముంబై కాకుండా వేరే టీమ్‌లో ఉంటే రోహిత్ శర్మ ఇన్ని టైటిల్స్ గెలవగలడా? అని నన్ను చాలా మంది అడుగుతున్నారు. అయితే నేను దీని గురించి ఎందుకు ఆలోచించాలి... కెప్టెన్‌గా నిరూపించుకోవాల్సిన అవసరం ఏముంది? ముంబై టీమ్ ఆలోచనల ప్రకారం నేను ఆటగాడిగా, కెప్టెన్‌గా రాణించాను...
undefined
ఏ జట్టుకైనా ఒక్క రాత్రిలోనే ఫలితాలు రావు. ముంబై ఇండియన్స్‌కి కూడా మొదటి ఐదు సీజన్లలో ఒక్క టైటిల్ కూడా రాలేదు... నాతో సహా ముంబై జట్టులో ఇప్పుడున్న స్టార్లు అందరూ 2011లో వేలంలో అందుబాటులో ఉన్నవారే...
undefined
మిగిలిన జట్లతో పోలిస్తే మా జట్టులో పోలార్డ్, బుమ్రా, హార్ధిక్ పాండ్యా, ట్రెంట్ బౌల్ట్ వంటి స్టార్లు ఉన్నారు. నిజమే... కానీ వారిపై నమ్మకం ఉంచి, జట్టుతో కొనసాగిస్తూ స్టార్లుగా మార్చింది మాత్రం ముంబై ఫ్రాంఛైజీయే...
undefined
గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడిన ట్రెంట్ బౌల్ట్, అంతకుముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి కూడా ఆడాడు. కానీ ముంబై ఇండియన్స్‌లోకి వచ్చాకే సత్తా చాటాడు... జట్టును మార్చకుండా మ్యాచ్ విన్నర్లుగా మార్చడంలోనే ముంబై అసలైన విజయ రహస్యం దాగి ఉంది...’ అంటూ చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ.
undefined
ఆసీస్ టూర్‌లో సెలక్ట్ కాలేకపోయినందుకు సూర్యకుమార్ యాదవ్... నిరాశకు గురయ్యాడని చెప్పిన రోహిత్ శర్మ, తనతో మాట్లాడి ధైర్యం చెప్పానని చెప్పాడు. ‘భారత జట్టును ప్రకటించినప్పుడు అందరం టీమ్ రూమ్‌లోనే ఉన్నాం.
undefined
సూర్యకుమార్ యాదవ్ పేరు లేకపోవడంతో అతను నిరాశ చెందాడు. కాసేపు ఎవ్వరితో మాట్లాడలేదు. కొద్దిసేపటి తర్వాత అతనే వచ్చి మాట్లాడాడు. భారత జట్టులో ఆడకపోయినా ముంబైకి మ్యాచులు గెలిపిస్తావని చెప్పాను. అది విన్నాక అతను కుదుటపడ్డాడు.. ఏదో ఒకరోజు టీమిండియాకు ఆడతాడు’ అని చెప్పాడు రోహిత్ శర్మ.
undefined
click me!