బీసీసీఐ నిర్ణయంతో ఎంసీజీ, విక్టోరియా ప్రభుత్వం ఆశల అడియాసలయ్యాయి. భారత్ - పాక్ ల మధ్య చివరిసారి టెస్టు మ్యాచ్ 2007లో జరిగింది. 2013 తర్వాత ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు కూడా జరగడం లేదు. సరిహద్దు వివాదాలు, రాజకీయ, ఇతర కారణాలతో ఇండియా-పాక్ లు ఐసీసీ, ఆసియా కప్ లలో తప్ప నేరుగా తలపడటం లేదన్న విషయం తెలిసిందే.