హైదరాబాద్‌లో ఇండియా vs న్యూజిలాండ్... వైజాగ్‌లో ఆస్ట్రేలియాతో వన్డే! టీమిండియా షెడ్యూల్ ఇదే...

Published : Dec 08, 2022, 01:37 PM IST

ప్రస్తుతం బంగ్లాదేశ్‌ పర్యటనలో ఉన్న భారత జట్టు, మూడు వన్డేల సిరీస్ ముగిసిన తర్వాత రెండు టెస్టులు ఆడబోతోంది. టెస్టు మ్యాచులు ముగిసిన తర్వాత స్వదేశానికి చేరుకునే టీమిండియా, వచ్చే ఏడాది స్వదేశంలో శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో సిరీస్‌లు ఆడబోతోంది...

PREV
18
హైదరాబాద్‌లో ఇండియా vs న్యూజిలాండ్... వైజాగ్‌లో ఆస్ట్రేలియాతో వన్డే! టీమిండియా షెడ్యూల్ ఇదే...
team india

ఐపీఎల్ 2023 టోర్నీకి ముందు టీమిండియాకి సంబంధించిన మూడు నెలల షెడ్యూల్‌ని ఖరారు చేసింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. బంగ్లాదేశ్ పర్యటన ముగిసిన తర్వాత స్వదేశంలో శ్రీలంక జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ ఆడబోతోంది భారత జట్టు...

28

జనవరి 3న ముంబై వేదికగా ఇండియా, శ్రీలంక మధ్య తొలి టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత జనవరి 5న పూణేలో రెండో టీ20, జనవరి 7న రాజ్‌కోట్‌లో మూడో టీ20 మ్యాచ్ జరుగుతాయి. ఆ తర్వాత జనవరి 10 నుంచి వన్డే సిరీస్ ఆరంభమవుతుంది.

38

జనవరి 10న గౌహతిలో తొలి వన్డే జరుగుతుంది. ఆ తర్వాత జనవరి 12న కోల్‌కత్తాలో రెండో వన్డే, జనవరి 15న త్రివేండ్రం వేదికగా ఇండియా, శ్రీలంక మధ్య మూడో వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్ తర్వాత శ్రీలంక జట్టు, భారత పర్యటనను ముగించుకుని స్వదేశానికి పయనం అవుతుంది...
 

48

శ్రీలంకతో సిరీస్ ముగిసిన మూడు రోజులకే న్యూజిలాండ్‌తో సిరీస్ మొదలవుతుంది. జనవరి 18న హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో తొలి వన్డే ఆడుతుంది టీమిండియా... జనవరి 21న రాయిపూర్ వేదికగా రెండో వన్డే, జనవరి 24న ఇండోర్ వేదికగా ఆఖరి వన్డే జరుగుతాయి..

58

జనవరి 27న రాంఛీ వేదికగా ఇండియా, న్యూజిలాండ్ మధ్య తొలి టీ20 ప్రారంభం అవుతుంది. జనవరి 29న లక్నోలో రెండో టీ20 ఆడే భారత జట్టు, ఆ తర్వాత ఫిబ్రవరి 1న అహ్మదాబాద్‌లో ఆఖరి టీ20 ఆడుతుంది... ఈ మ్యాచ్‌తో న్యూజిలాండ్ సిరీస్ ముగుస్తుంది...

68

న్యూజిలాండ్‌ సిరీస్ ముగిసిన తర్వాత భారత జట్టుకి వారం రోజుల విశ్రాంతి దొరుకుతుంది. మళ్లీ ఫిబ్రవరి 9 నుంచి ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడబోతోంది భారత క్రికెట్ జట్టు. నాగ్‌పూర్ వేదికగా ఫ్రిబవరి 9న తొలి టెస్టు ఆరంభమవుతుంది...

78

ఆ తర్వాత ఫిబ్రవరి 17న ఢిల్లీలో రెండో టెస్టు, మార్చి 1న ధర్మశాలలో మూడో టెస్టు, మార్చి 9న అహ్మదాబాద్‌లో ఆఖరి టెస్టు మ్యాచ్ జరుగుతాయి. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి అర్హత సాధించేందుకు ఈ టెస్టు సిరీస్ విజయం టీమిండియాకి చాలా కీలకం..
 

88

టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత మార్చి 17న ముంబైలో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే జరుగుతుంది. ఆ తర్వాత మార్చి 19న వైజాగ్‌లో రెండో వన్డే, మార్చి 22న చెన్నైలో మూడో వన్డే జరుగుతాయి. ఈ సిరీస్ ముగిసిన తర్వాత భారత్, ఆస్ట్రేలియా ప్లేయర్లు... ఐపీఎల్ 2023 సీజన్‌లో పాల్గొంటారు. మార్చి 29 లేదా మార్చి 31న ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభం కాబోతున్నట్టు సమాచారం.. 

click me!

Recommended Stories