అలా టీమిండియాకి దూరమైన ఆవేశ్ ఖాన్, తిరిగి భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో ఆడుతూ ఇప్పటికే 22 వికెట్లు తీసుకున్నాడు. జ్వరంతో బాధపడుతున్నాడని ఆవేశ్ ఖాన్ని పక్కనబెట్టేసిన టీమిండియా మేనేజ్మెంట్, జ్వరం నుంచి పూర్తిగా కోలుకోని అర్ష్దీప్ సింగ్ని ఆడించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్...