విరాట్ కోహ్లీ పుట్టబోయే బిడ్డ ఆస్ట్రేలియన్ అవుతాడు... సంచలన వ్యాఖ్యలు చేసిన అలెన్ బోర్డర్...

First Published Nov 21, 2020, 3:00 PM IST

భారత సారథి విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ త్వరలో ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో అనుష్క శర్మకు ప్రసవం అవుతుందని, సోషల్ మీడియా వేదిక ప్రకటించింది విరుష్క జంట. విరాట్ కోహ్లీకి పుట్టబోయే బిడ్డ గురించి సరదా వ్యాఖ్యలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ అలెన్ బోర్డర్. అయితే ఈ ఫన్నీ కామెంట్స్‌పై విరాట్ ఫ్యాన్స్ మాత్రం గుర్రు అవుతున్నారు.

ఐపీఎల్ 2020 సీజన్ కోసం అనుష్క శర్మను యూఏఈ తీసుకెళ్లాడు విరాట్ కోహ్లీ... కడుపుతో ఉన్న భార్యను ఒంటరిగా వదిలి ఉండడం ఇష్టం లేక... తనతో తీసుకెళ్లిన విరాట్, క్వారంటైన్‌తో కలిసి రెండు నెలలకు పైగా బయో బబుల్‌లో గడిపారు.
undefined
ఐపీఎల్ తర్వాత ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా టూర్‌కి కూడా అనుష్క శర్మను వెంటతీసుకెళ్లాలని భావించాడు విరాట్ కోహ్లీ... మొదట ఆస్ట్రేలియాలోనే బిడ్డకు జన్మనివ్వాలని భావించారు.
undefined
ఇందుకోసం బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా మధ్య చర్చలు కూడా జరిగాయి. అనుష్క శర్మ కోసం ఓ ఫేమస్ హాస్పటిల్‌లో ప్రత్యేక ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని టాక్ వచ్చింది.
undefined
అయితే బయో బబుల్ నిబంధనల కారణంగా అనుష్క శర్మ ఇబ్బంది పడడం చూసిన కోహ్లీ, ఆ నిర్ణయం నుంచి వెనక్కితగ్గాడు. తన వెంట ఆస్ట్రేలియా తీసుకెళ్లి, అనుష్కను ఇబ్బంది పెట్టడం కంటే స్వదేశంలో ఉంచడం బెటర్ అని ఫీల్ అయ్యాడు.
undefined
యూఏఈ నుంచి విరాట్ కోహ్లీ ఆసీస్ టూర్‌కి పయనం కాగా, అనుష్క శర్మ డెలివరీ కోసం స్వదేశం చేరుకుంది...పెటర్నిటీ లీవ్ ద్వారా మొదటి టెస్టు ముగిసిన తర్వాత స్వదేశం చేరుకోబోతున్నాడు విరాట్ కోహ్లీ... ఈ నిర్ణయంపై తనదైన శైలిలో కామెంట్ చేశాడు ఆసీస్ మాజీ క్రికెటర్ అలెన్ బోర్డర్.
undefined
‘టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ ఆస్ట్రేలియాలో ప్రసవిస్తుందని అనుకున్నాం... కోహ్లీ సంతానాన్ని ఆస్ట్రేలియాన్ అవుతాడని ఆశించాను...’ అంటూ ఓ మీడియా సమావేశంలో ఫన్నీ కామెంట్ చేశాడు అలెన్ బోర్డర్.
undefined
అయితే ఈ కామెంట్‌పై విరాట్ ఫ్యాన్స్ నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. విరాట్ కోహ్లీ లాంటి క్రికెటర్‌కి పుట్టబోయే సంతానం ఆస్ట్రేలియన్ అవ్వాలని బోర్డర్ ఆశిస్తుండడం గర్వంగా ఉందని కొందరు అంటుంటే...
undefined
దేశానికి దూరంగా ఎక్కడో ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న విరుష్క జోడిపై బోర్డర్ వెటకారంగా ఈ కామెంట్లు చేశాడని మరికొందరు అంటున్నారు.
undefined
విరాట్ కోహ్లీ గైర్హజరీతో అజింకా రహానే మిగిలిన మూడు టెస్టులకు అజింకా రహానే కెప్టెన్‌గా వ్యవహారించబోతున్నాడు... టీ20, వన్డే సిరీస్‌లకు దూరంగా ఉన్న రోహిత్ శర్మ, టెస్టు సమయంలో జట్టులో చేరతాడు.
undefined
ఆసీస్ మాజీ క్రికెటర్ అలెన్ బోర్డర్, భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ పేర్ల మీదుగానే ‘బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీ’ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే...
undefined
click me!