94 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 122 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, వన్డేల్లో 47వ సెంచరీ అందుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ కారణంగా ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచిన విరాట్ కోహ్లీ, ఆసియా కప్లో అత్యధిక ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు గెలిచిన టీమిండియా ప్లేయర్గా రికార్డు క్రియేట్ చేశాడు..