వికెట్ కీపర్లలో భారత్ గతంలో ఎన్నడూ లేని పోటీని ఎదుర్కుంటున్నది. దినేశ్ కార్తీక్ తో పాటు రిషభ్ పంత్, సంజూ శాంసన్ వంటి పలువురు టాలెంటెడ్ క్రికెటర్లు కూడా టీ20 ప్రపంచకప్ లో చోటు కోసం తాపత్రయపడుతున్నారు. మిగతావారి సంగతి పక్కనబెడితే రిషభ్ వేరు. ధోని నిష్క్రమణ తర్వాత పంత్.. భారత జట్టుకు రెగ్యులర్ వికెట్ కీపర్ అయ్యాడు. వికెట్ కీపింగ్ తో పాటు పంత్ మిడిలార్డర్ తో పాటు ఓపెనర్ గానూ రాణించగల సమర్థుడు.