సీనియర్లు లేకుండా పూర్తిస్థాయి యువ జట్టులో లంకతో బరిలోకి దిగిన టీమిండియా తొలి టీ20లో చావు తప్పి కన్నులొట్టపోయిన చందంగా గెలిచింది. బ్యాటింగ్ లో విఫలమైన భారత జట్టు.. తర్వాత బౌలింగ్ లో మెరుగ్గానే రాణించినా చివర్లో గాడి తప్పంది. యువ బౌలర్లు ఉమ్రాన్ మాలిక్, అరంగేట్ర కుర్రాడు శివమ్ మావి మెరిసినా చివరి బంతి వరకూ ఫలితం తేలని పరిస్థితి.