IND vs ENG: చరిత్ర సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్.. చాహ‌ల్ రికార్డు బ్రేక్

Published : Jan 22, 2025, 11:41 PM IST

IND vs ENG: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ లో అద‌ర‌గొడుతూ టీమిండియా సూప‌ర్ విక్ట‌రీ అందుకుంది. ఈ మ్యాచ్ లో యంగ్ పేస‌ర్ అర్ష్ దీప్ సింగ్ చ‌రిత్ర సృష్టించాడు.   

PREV
15
IND vs ENG: చరిత్ర సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్.. చాహ‌ల్ రికార్డు బ్రేక్
Image Credits: Twitter/BCCI

India vs England: కోల్ క‌తాలోని ఈడెన్ గార్డెన్ లో ఇంగ్లాండ్ తో జ‌రిగిన మ్యాచ్ లో భార‌త జ‌ట్టు 7 వికెట్ల తేడాతో అద్భుత విజ‌యాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ లో అద‌ర‌గొట్టింది. 

బౌలింగ్ లో అర్ష్ దీప్ సింగ్, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, హార్దిక్ పాండ్యా, అక్ష‌ర్ ప‌టేల్ లు అద‌ర‌గొట్టారు. ఇక బౌలింగ్ లో అభిషేక్ శ‌ర్మ ప‌రుగుల సునామీ సృష్టించాడు. అత‌నికి తోడుగా సంజూ శాంస‌న్, తిల‌క్ వ‌ర్మ‌లు రాణించ‌డంతో భార‌త్ 13 ఓవ‌ర్ లోనే విజ‌యాన్ని అందుకుంది. ఇంగ్లాండ్ 132 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది.

25

చ‌రిత్ర సృష్టించిన అర్ష్ దీప్ సింగ్

ఇంగ్లండ్ తో జ‌రిగిన మ్యాచ్ లో టీమిండియా స్టార్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ చరిత్ర సృష్టించాడు. టీ20 ఇంటర్నేషనల్‌లో యుజ్వేంద్ర చాహల్ రికార్డును బద్దలు కొట్టాడు. ఇప్పుడు టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అర్ష్‌దీప్ సింగ్ నిలిచాడు.

ఇంగ్లండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. అర్ష్‌దీప్ రాగానే ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లకు పెవిలియన్ దారి చూపి ఇంగ్లీష్ జట్టు వెన్ను విరిచాడు. మ్యాచ్ ప్రారంభ‌మైన 15 నిమిషాల్లోనే అత‌ను రెండు వికెట్లు తీసుకుని ఈ ఘ‌న‌త సాధించాడు.

35

చాహల్ రికార్డును బ్రేక్ చేసిన అర్ష్ దీప్ సింగ్ 

టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రికార్డు యుజ్వేంద్ర చాహల్ పేరిట ఉండేది. అయితే, ఇంగ్లాండ్ తో జ‌రిగిన మ్యాచ్ లో అర్ష్ దీప్ సింగ్ దీన్ని అధిగ‌మించాడు.

అత్య‌ధిక వికెట్లు తీసిన రికార్డును అందుకునేందుకు చాహల్‌కు 7 ఏళ్లు పట్టింది. 2016 నుంచి 2023 వరకు 80 టీ20 మ్యాచ్‌లు ఆడి 96 వికెట్లు తీశాడు. కానీ అర్ష్‌దీప్ 2022 నుండి 2025 వరకు మాత్రమే నంబర్-1ని కైవసం చేసుకున్నాడు. తన 61వ టీ20 మ్యాచ్‌లోనే ఈ ఘనత సాధించాడు.

45

భారత్‌కు శుభారంభం అందించిన అర్ష్ దీప్ సింగ్

తొలి టీ20లో టీమిండియా శుభారంభం చేసింది. పవర్ ప్లేలోనే టీమ్ ఇండియాకు 2 వికెట్లు దక్కాయి. ఆ త‌ర్వాత కూడా మ‌న బౌల‌ర్లు రాణించారు. భార‌త్ తరఫున హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ తలో 2 వికెట్లు తీసుకున్నారు. వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీశారు. కీలక సమయంలో అవసరమైన వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

55

టీ20లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌల‌ర్ల జాబితా ఇదే

97 అర్ష్‌దీప్ సింగ్ (61 మ్యాచ్ లు)
96 యుజ్వేంద్ర చాహల్ (80 మ్యాచ్ లు)
90 భువనేశ్వర్ కుమార్ (87 మ్యాచ్ లు)
89 జస్ప్రీత్ బుమ్రా (70 మ్యాచ్ లు)
89 హార్దిక్ పాండ్యా (110 మ్యాచ్ లు)

Read more Photos on
click me!

Recommended Stories