భారీ లక్ష్యఛేదనలో నాగాలాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 106 పరుగులకి మాత్రమే పరిమితమై 97 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో మిగిలిన మ్యాచుల్లో ఆడుతున్న భారత ప్లేయర్లు కేరళ కెప్టెన్ సంజూ శాంసన్, కర్ణాటక ఓపెనర్ దేవ్దత్ పడిక్కల్ నిరాశపరచగా మయాంక్ అగర్వాల్, నితీశ్ రాణా, నవ్దీప్ సైనీ మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నారు..