భారత జట్టు మాజీ సారథి, బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీకి అన్యాయం జరిగిందని క్రికెట్ వర్గాలలో జోరుగా చర్చ జరుగుతున్నది. ఇప్పుడు ఈ వాదనకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా గొంతు కలిపారు. ఆమె తాజాగా.. దాదాను బీసీసీఐ నుంచి తప్పించడం మంచిది కాదని, కేంద్ర హోంమంత్రి కుమారుడు జై షాకు ఓ న్యాయం, గంగూలీకి ఓ న్యాయం ఉంటుందా..? అని ప్రశ్నించారు.