సాంటా క్లాజ్గా మారిన హార్ధిక్ పాండ్యా... కొడుకు, భార్యతో కలిసి...
First Published Dec 26, 2020, 8:22 AM ISTభారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సాంటా క్లాజ్గా మారాడు. క్రిస్మస్ సందర్భంగా తన కొడుకుతో కలిసి సాంటా క్లాజ్ వేషంలో సంబరాలు చేసుకుంది పాండ్యా ఫ్యామిలీ. కొడుకు అగస్త్యను చేతుల్లో ఒడిసి పట్టుకున్న హార్ధిక్ పాండ్యా... ‘మై బాయ్ ఫస్ట్ క్రిస్మస్’ అంటూ కాప్షన్ పెట్టాడు. ఐపీఎల్ 2020 సీజన్ కోసం నెలన్నర వయసున్న కొడుకున్న స్వదేశంలో వదిలి యూఏఈ వెళ్లిన హార్ధిక్ పాండ్యా, అటు నుంచి ఆస్ట్రేలియాకి వెళ్లాడు. టీ20, వన్డే సిరీస్లో అదరగొట్టిన పాండ్యా... టీ20ల్లో ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు కూడా దక్కించుకున్నాడు. అవకాశం వచ్చినా టెస్టు సిరీస్ ఆడనని, ఇంటికెళ్లిపోతానని చెప్పిన హార్ధిక్ పాండ్యా, ఫ్యామిలీ టైమ్ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు.