2020 నుంచి అజింకా రహానే 35 ఇన్నింగ్స్ల్లో 24.08 సగటుతో 819 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇదే సమయంలో విరాట్ కోహ్లీ 33 ఇన్నింగ్స్ల్లో 26.45 సగటుతో 873 పరుగులు చేశాడు. అయితే కోహ్లీని కొనసాగిస్తున్న టీమిండియా మేనేజ్మెంట్, రహానేని మాత్రం పూర్తిగా పక్కనబెట్టేసింది..