టీ20 వరల్డ్ కప్ దాదాపు తుది అంకానికి చేరింది. ఈ మెగా టోర్నీలో భారత జట్టుతో పాటు న్యూజిలాండ్, పాకిస్తాన్, ఇంగ్లాండ్ కూడా సెమీస్ చేరిన విషయం తెలిసిందే. నవంబర్ 9న న్యూజిలాండ్ - పాకిస్తాన్, నవంబర్ 10 న ఇండియా-ఇంగ్లాండ్ మ్యాచ్ జరుగుతాయి. అయితే సెమీస్ మ్యాచ్ లకు ముందు టీమిండియా ఫ్యాన్స్ కు ఓ భయం పట్టుకుంది.