గతేడాది టీ20 ప్రపంచకప్ సందర్భంగా అఫ్రిది.. రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ల వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే. తొలి రెండు ఓవర్లలో అతడు చేసిన డ్యామేజ్ తో భారత జట్టు కోలుకోలేదు. కోహ్లీ ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించినా మిగిలిన బ్యాటర్లు అంతగా ఆకట్టుకోలేదు. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా భారత్ దారుణంగా విఫలమైంది. ఫలితంగా భారత్ ను పాక్ పది వికెట్ల తేడాతో ఓడించింది.