2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ లేకపోయినా... రోహిత్ శర్మ పెద్దగా ఆడకపోయినా, అజింకా రహానే కెప్టెన్సీలో, రవిశాస్త్రి కోచింగ్లో రిషబ్ పంత్, శుబ్మన్ గిల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, నటరాజన్ వంటి కుర్రాళ్లు మ్యాజిక్ చేశారు. 32 ఏళ్లుగా చెక్కుచెదరని బ్రిస్బేన్ కోటను కూల్చి, గబ్బాలో ఆస్ట్రేలియాకి పరాజయాన్ని రుచి చూపించారు...