పాకిస్తాన్ ఇప్పటికే గాయాలతో సతమతమవుతున్నది. ఈ టోర్నీకి ముందు ఆ జట్టు ప్రధాన పేసర్ షహీన్ షా అఫ్రిది గాయంతో తప్పుకున్నాడు. వసీం జూనియర్ కూడా గాయం కారణంగా దూరమయ్యాడు. సూపర్-4కు ముందు ఆ జట్టు మరో పేసర్ షహన్వాజ్ దహానీ గాయపడి భారత్ తో మ్యాచ్ ఆడలేదు. ఇప్పుడు రిజ్వాన్ గాయం పెద్దదని తేలితే అతడు కూడా వీళ్ల జాబితాలో చేరనున్నాడు.