ఐపీఎల్ రిటెన్షన్ లో భాగంగా హైదరాబాద్ యాజమాన్యం.. 2015 నుంచి జట్టుతో ఉంటున్న కేన్ విలియమ్సన్ ను పక్కకుబెట్టింది. అతడిని వేలంలోకి వదిలేసింది. 2021 సీజన్ లో డేవిడ్ వార్నర్ ను పక్కనబెట్టి మరీ కేన్ మామకు సారథ్య బాధ్యతలు అప్పజెప్పిన హైదరాబాద్.. 2022 సీజన్ లో అతడిని రూ. 14 కోట్లకు దక్కించుకుని అందరికీ షాకిచ్చింది.