ఈనెల 23న మెల్బోర్న్ వేదికగా జరుగబోయే ఇండియా-పాకిస్తాన్ పోరు కోసం క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఇరు దేశాల క్రికెట్ బోర్డులు కొత్త వివాదానికి తెరలేపాయి. ఒకవైపు ఆస్ట్రేలియా ఇరు దేశాల ఆటగాళ్లు కలిసి కబుర్లు చెప్పుకుంటూ, ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే స్వదేశాలలో రెండు దేశాల బోర్డు పెద్దలు మాత్రం కత్తులు దూసుకుంటున్నారు.