మ్యాచ్ ను 37 ఓవర్లలోనే ముగించడం తమకు సంతోషంగా ఉందని.. ఇంత త్వరగా ముగుస్తుందని తాము కూడా ఊహించలేదని ఆసీస్ సారథి స్టీవ్ స్మిత్ తెలిపాడు. కొత్త బంతితో మిచెల్ స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని, ఛేదనలో ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ లు బాగా బ్యాటింగ్ చేశారని స్మిత్ కొనియాడాడు. భారత్ పై విజయంతో ఆసీస్.. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను 1-1 తో సమం చేసింది. మూడో వన్డే ఈనెల 22న చెన్నై వేదికగా జరుగనుంది.