టీ20లలో సీనియర్లు రోహిత్, కోహ్లీ, రాహుల్ లను పక్కనబెట్టిన సెలక్టర్లు.. శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్ లతో ఓపెనింగ్ చేయిస్తున్నారు. ఈ ఇద్దరికీ విఫలమైనా వరుసగా అవకాశాలు దక్కుతున్నాయి. 2024 టీ20 ప్రపంచకప్ ను దృఫ్టిలో ఉంచుకుని కొత్త జట్టును సంసిద్ధం చేయడానికి సెలక్టర్లు పదే పదే ఈ ఇద్దరినీ ఆడిస్తున్నారని వాదనలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.