గత దశాబ్దంలో భారత క్రికెట్ కు కర్త, కర్మ, క్రియగా మారాడు జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోని. 2007లో ఐసీసీ తొలిసారి నిర్వహించిన టీ20 ప్రపంచకప్ ను నెగ్గిన ధోని.. ఆ తర్వాత 2011 వన్డే ప్రపంచకప్, 2013 లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ కు అందించాడు. ధోని సారథ్యంలో భారత్ స్వర్ణ యుగాన్ని చూసింది.