ప్రపంచకప్ తర్వాత కోచ్ గా ద్రవిడ్ కాంట్రాక్ట్ ముగియడంతో ఐపీఎల్ జట్లు రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ద్రావిడ్ ను కోచ్ లేదా మెంటార్ గా నియమించాలని సంప్రదించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అలాగే, ద్రవిడ్ స్థానంలో జాతీయ క్రికెట్ అకాడమీ అధిపతి వీవీఎస్ లక్ష్మణ్ భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గా వ్యవహరిస్తారని కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు నెహ్రాకు సంబంధించిన ఈ న్యూస్ వైరల్ అవుతోంది.