బీసీసీఐ గతంలో ఈడెన్ గార్డెన్స్ లో (బంగ్లాదేశ్), మోతేరా (ఇంగ్లాండ్),బెంగళూరు (శ్రీలంక) లలో డేఅండ్ నైట్ టెస్టులను నిర్వహించింది. ఇక అహ్మదాబాద్ లోనే మరోసారి పింక్ బాల్ టెస్టును నిర్వహించనుంది. 2021లో కరోనా విజృంభించినా భారత్.. స్వదేశంలో ఇంగ్లాండ్ తో నాలుగు, న్యూజిలాండ్, శ్రీలంకలతో తలా రెండు టెస్టులను నిర్వహించిన విషయం తెలిసిందే.