ఉర్విల్ పటేల్ ఐపీఎల్ వేలం ముగిసిన తర్వాతి రోజు అద్భుతమైన ఇన్నింగ్స్ తో కేవలం 28 బంతుల్లో సెంచరీ సాధించాడు. నవంబర్ 27న గుజరాత్, త్రిపుర మధ్య జరిగిన మ్యాచ్లో ఉర్విల్ పటేల్ 28 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఉర్విల్ చేసిన ఈ సెంచరీ టీ-20 క్రికెట్లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ. టీ20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన రికార్డు ఎస్టోనియాకు చెందిన సాహిల్ చౌహాన్ పేరిట ఉంది. సైప్రస్పై కేవలం 27 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.
టీ20లో వేగవంతమైన సెంచరీ
1. సాహిల్ చౌహాన్ (ఈస్టోనియా) – సైప్రస్పై 27 బంతుల్లో (2024)
2. ఉర్విల్ పటేల్ (గుజరాత్) – త్రిపురపై 28 బంతులు (2024)
3. క్రిస్ గేల్ (RCB) – 30 బంతుల్లో పుణె వారియర్స్పై (2013)
4. రిషబ్ పంత్ (ఢిల్లీ) – 32 బంతుల్లో హిమాచల్ పై (2018)
5. విహాన్ లుబ్బే (నార్త్-వెస్ట్) – లింపోపోపై 33 బంతులు (2018)