3వ టెస్టులో జడేజా అద్భుత ప్రదర్శన
మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో జడేజా 22 ఓవర్లలో 65 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. అతను తన అద్భుతమైన ఫామ్ను రెండవ ఇన్నింగ్స్లోనూ కొనసాగించాడు. రెండో ఇన్నింగ్స్ మొత్తం 55 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదుగురు కివీ బ్యాటర్లను పెవిలియన్ కు పంపాడు. దీంతో ఒక ఇన్నింగ్స్ లో ఐదుకంటే ఎక్కువ వికెట్లు తీసుకోవడం 15వ సారి కావడంతో బిషన్ సింగ్ బేడీ సాధించిన 14 సార్లు 5 వికెట్ల రికార్డును అధిగమించాడు.
బేడీ తన కెరీర్లో 67 టెస్టుల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించి 14 సార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు.
అయితే జడేజా తన 77 మ్యాచ్ల్లో 15 సార్లు ఐదు వికెట్లు సాధించాడు. భారత్ తరఫున టెస్టుల్లో అత్యధికంగా ఐదు వికెట్లు తీసిన ఆటగాడిగా ఆర్ అశ్విన్ 105 మ్యాచ్ల్లో 37 సార్లు 5 వికెట్లు పడగొట్టాడు. అతని తర్వాత లెజెండరీ బౌలర్ అనిల్ కుంబ్లే (35), హర్భజన్ సింగ్ (25), కపిల్ దేవ్ (23), భగవత్ చంద్రశేఖర్ (16) ఉన్నారు. వారి తర్వాత రవీంద్ర జడేజా(15) ఉన్నాడు.