భారత్కు చెందిన ప్రముఖ ఐటీ నిపుణుడు త్రపిత్ బన్సల్కు మెటా బంపరాఫర్ ఇచ్చింది. ఓపెన్ఏఐ సంస్థలో పనిచేస్తున్న త్రపిత్కు మెటా ఏకంగా రూ. 800 కోట్ల బోనస్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఐఐటీ కాన్పూర్లో గణితం, గణాంక శాస్త్రంలో గ్రాడ్యుయేషన్ చేసి, తరువాత అమెరికాలోని మసాచుసెట్స్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్లో పీహెచ్డీ పూర్తి చేశారు త్రపిత్.
అక్కడే డీప్ లెర్నింగ్, మెషీన్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (NLP) లో స్పెషలైజేషన్ చేశారు. అసెంచర్లో అనలిస్ట్గా మొదలైన త్రపిత్ ప్రయాణం.. IISc బెంగళూరులో రీసెర్చ్ అసిస్టెంట్గా కొనసాగింది. తర్వాత ఫేస్బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఓపెన్ఏఐ సంస్థలతో కలిసి పని చేశారు.