Salary: దేశంలో ఎక్కువ జీతం వ‌చ్చే రంగం ఏంటి.? ఏ న‌గ‌రాల్లో జీతాలు ఎక్కువ‌గా పెరుగుతున్నాయి.?

Published : Jul 04, 2025, 01:40 PM IST

దేశంలో సొంతంగా వ్యాపారం చేసే వారి కంటే ఉద్యోగం చేసే వారి సంఖ్య అధికంగా ఉంది. అయితే ఏ రంగంలో ఉద్యోగం చేసే వారికి అధికంగా జీతాలు వ‌స్తున్నాయి.? ఏ న‌గ‌రాల్లో జీతాలు వేగంగా పెరుగుతున్నాయి.? లాంటి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

PREV
15
వేత‌నాల్లో టాప్ ప్లేస్‌లో

దేశంలో ఉద్యోగ అవకాశాలు విస్తృతంగా ఉన్నా, ఐటీ రంగానికి ఉండే ఆకర్షణ ప్ర‌త్యేమ‌ని తెలిసిందే. పెరుగుతోన్న ప్ర‌పంచ‌రీక‌ర‌ణ‌, టెక్నాల‌జీ కార‌ణంగా ఈ రంగం రోజురోజుకీ విస్త‌రిస్తోంది. తాజాగా ఇండీడ్ పేమ్యాప్ అనే ప్లాట్‌ఫామ్ నిర్వహించిన సర్వే ప్రకారం... దేశంలో అత్యధిక వేతనాలు అందిస్తున్న రంగాల్లో ఐటీ మొద‌టి స్థానంలో నిలిచింది.

25
టెక్ రంగంలో ఫ్రెషర్లు ఎంత సంపాదిస్తున్నారు?

ఇండీడ్ సర్వే ప్రకారం టెక్ రంగంలో ఉద్యోగాన్ని మొదలుపెట్టే ఫ్రెషర్లు నెలకు సగటున రూ.28,600 వరకు వేతనం పొందుతున్నారని తేలింది. అదే ఐదు నుంచి ఏడు ఏళ్ల అనుభవం ఉన్నవారైతే నెలకు దాదాపు రూ.68,900 వరకు సంపాదిస్తున్నారని స‌ర్వేలో వెల్ల‌డైంది. విద్య‌, అనుభ‌వం, నైపుణ్యాల ఆధారంగా ఈ వేత‌నాల్లో హెచ్చుత‌గ్గులు ఉంటాయ‌ని నివేదిక పేర్కొంది.

35
తయారీ, టెలికాం రంగాల్లో స్థిరమైన ఆదాయం

టెక్ తర్వాత అత్యధిక వేతనాలు అందించే రంగాల్లో తయారీ (Manufacturing), టెలికాం (Telecom) ఉన్నాయి. ఈ విభాగాల్లో ఎంట్రీ లెవల్ ఉద్యోగులకు నెలకు రూ.28,100 నుంచి రూ.28,300 వరకు జీతం లభిస్తోందని సర్వే వెల్లడించింది. ఇక 5-8 ఏళ్ల అనుభవం కలిగినవారికి రూ.67,700 నుంచి రూ.68,200 వరకు వేతనాలు అందుతున్నట్లు పేర్కొంది.

45
సాఫ్ట్‌వేర్, మేనేజ్‌మెంట్ ఉద్యోగాలకు భారీ జీతాలు

ఇండీడ్‌ సర్వేలో పేర్కొన్న విధంగా, సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, హెచ్‌ఆర్ ఇంజినీరింగ్ ఉద్యోగాల్లో కూడా ఆకర్షణీయ జీతాలే లభిస్తున్నాయి. ప్రారంభ స్థాయిలో జీతం రూ.25,000 నుంచి రూ.30,500 వరకు ఉండగా, ప్రాజెక్ట్ మేనేజర్లు, ప్రొడక్ట్ మేనేజర్ల వంటి మిడిల్ లెవల్ ఉద్యోగులకు నెలకు రూ.85,500 వరకూ వేతనాలు అందుతున్నాయి. అంటే, నైపుణ్యం పెరిగితే సంపాదనలో కూడా గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది.

55
జీతాలు పెరిగినా… అసంతృప్తి పెరుగుతుందా?

ఐటీ సహా ఇతర రంగాల్లో జీతాల పెరుగుదల కనిపిస్తున్నా, ఉద్యోగుల్లో ఆర్థిక ఒత్తిడి మాత్రం తగ్గటం లేదని స‌ర్వేలో తేలింది. సర్వేలో పాల్గొన్న ఉద్యోగుల్లో 69 శాతం మంది తమ ఆదాయం జీవన వ్యయాలకు సరిపడటం లేదని పేర్కొన్నారు.

ముఖ్యంగా ముంబయి, దిల్లీ, బెంగళూరు, పుణె వంటి మెట్రో నగరాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో అసంతృప్తి ఎక్కువ‌గా ఉన్నట్లు ఇండీడ్ తెలిపింది. హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్ నగరాల్లో మాత్రం వేతన పెంపు వేగంగా జరుగుతోందని కూడా ఈ నివేదిక తెలియజేసింది. ఈ స‌ర్వేను ఇండీడ్ సంస్థ దేశవ్యాప్తంగా 1,311 మంది కంపెనీ యజమానులు, 2,531 మంది ఉద్యోగులను ప్రశ్నించి రూపొందించింది.

Read more Photos on
click me!

Recommended Stories