భారత్ లో ఎంసీఎక్స్ ( MCX - Multi Commodity Exchange) అనేది అతిపెద్ద కమోడిటీ ఎక్స్ఛేంజ్. ఇది 2003లో ముంబైలో స్థాపించారు. ఇక్కడ బంగారం, వెండి, చమురు, వ్యవసాయ ఉత్పత్తుల ఫ్యూచర్ ట్రేడింగ్ జరుగుతుంది. 1 కిలో, 100 గ్రాములు, 8 గ్రాములు, 1 గ్రాము పరిమాణాల్లో ట్రేడింగ్ జరుగుతుంది.
బులియన్ మార్కెట్ అనేది బంగారం, వెండి వంటి విలువైన లోహాల వ్యాపార కేంద్రం. ఈ మార్కెట్లో ధరలు ప్రపంచ డిమాండ్, సరఫరా, ప్రభుత్వ విధానాలు, గ్లోబల్ ఎకానమీ ఆధారంగా మారుతుంటాయి. ప్రతిరోజూ మారే బంగారం ధర వెనుక గణాంకాలు, గ్లోబల్ మార్కెట్ పరిస్థితులు, రూపాయి విలువ కీలక పాత్ర పోషిస్తున్నాయి.