హంగేరిలో నివసిస్తున్న ఈ రాణి పేరు ఎలిజబెత్ బాతరీ. ఎలిజబెత్ బాతరీ చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన, క్రూరమైన మహిళా సీరియల్ కిల్లర్గా ప్రసిద్ధి చెందింది. 1585 నుండి 1610 మధ్య ఎలిజబెత్ బాతరీ 600 కంటే ఎక్కువ మంది బాలికలను అంటే పెళ్లికాని కన్యాలను చంపి వారి రక్తంతో స్నానం చేసేదట. తన అందాన్ని కాపాడుకోవడానికి కన్యల రక్తంతో స్నానం చేయమని ఎలిజబెత్కి ఎవరో సలహా ఇచ్చారని చెబుతుంటారు. ఎలిజబెత్ ఈ పద్ధతిని బాగా ఇష్టపడి దాని కోసం ఆమె క్రూరమైన హత్యలను చేసింది.