మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం కంపెనీ వ్యాపార పనితీరు బలంగా ఉన్నప్పటికీ, షేర్ ధర ఇప్పటికే భారీగా పెరిగింది. దీంతో భవిష్యత్తులో కూడా ఇదే స్థాయిలో రాబడి వస్తుందనే హామీ ఉండదని చెబుతున్నారు.
సాంకేతిక విశ్లేషణ ప్రకారం రూ.195 నుంచి రూ.200 వరకు ఈ షేర్కు కీలక సపోర్ట్ స్థాయి ఉండగా, రూ.220 నుంచి రూ.226 మధ్య రెసిస్టెన్స్ కనిపిస్తోంది. దీర్ఘకాలంలో కంపెనీ అవకాశాలు సానుకూలంగా ఉన్నప్పటికీ, ప్రస్తుత ధర వద్ద పెట్టుబడి పెట్టే ముందు కంపెనీ ఆర్థిక పరిస్థితి, మార్కెట్ పరిస్థితులు, రిస్క్లను పూర్తిగా అర్థం చేసుకుని నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: షేర్ మార్కెట్లో పెట్టుబడులు మార్కెట్ రిస్క్లకు లోబడి ఉంటాయి. పైన తెలిపిన సమాచారాన్ని సాధారణ అవగాహనగానే భావించాలి. పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక సలహాదారుల సూచనలు తీసుకోవడం మంచిది.