Silver Price: వెండి @ రూ. 2 ల‌క్ష‌లు.?

Published : Jun 19, 2025, 05:12 PM IST

బంగారం ధ‌ర‌లు చుక్క‌లు చూపిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే తులం బంగారం ధ‌ర రూ. ల‌క్ష దాటేసింది. అయితే రానున్న రోజుల్లో వెండి ధ‌ర‌లు కూడా భారీగా పెర‌గ‌నున్నాయ‌ని ప‌లువురు ఆర్థికవేత్త‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 

PREV
15
ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో

ఇజ్రాయెల్‌–ఇరాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో, ప్రపంచ మార్కెట్లో విలువైన లోహాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో భారతదేశంలోనూ బంగారం, వెండి ధరలకు రెక్క‌లొస్తున్నాయి. 

ఢిల్లీ బులియన్‌ మార్కెట్‌లో వెండి ధర రూ.1,08,200 స్థాయికి చేరింది. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యధికం. కేవ‌లం అంత‌ర్జాతీయంగా నెల‌కొన్న ప‌రిస్థితులే కాకుండా సుర‌క్షిత‌మైన పెట్టుబ‌డిగా బంగారాన్ని భావించ‌డ‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

25
కిలో వెండి రూ. 2 లక్ష‌లు కానుందా.?

ప్రపంచ ప్రఖ్యాత ఫైనాన్షియల్‌ రచయిత రాబర్ట్‌ కియోసాకి (Robert Kiyosaki) తాజాగా ఇచ్చిన వ్యాఖ్యలు మార్కెట్‌ను కుదిపేశాయి. “ఇప్పటివరకు ప్రపంచంలోనే గొప్ప బేరం వెండే. ఇది త్వరలో కిలోకు రూ.2 లక్షలు (సుమారు 2400 డాలర్లు) చేరవచ్చు” అని ఆయన అన్నారు. ఇది న్యాయంగా సాధ్యమేనా? అనే ప్రశ్న ఇప్పుడు ఇన్వెస్టర్లు, ఆర్థిక నిపుణుల మధ్య చర్చనీయాంశమైంది.

35
వెండి ధ‌ర పెర‌గ‌డానికి కార‌ణాలు

వెండి ధరలు పెరగడానికి పలు ఆర్థిక, పారిశ్రామిక, భౌగోళిక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వాటిలో ముఖ్యమైనవి:

పారిశ్రామిక వినియోగం పెరుగుదల:

వెండి ప్రధానంగా సోలార్ ప్యానెల్స్‌, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్‌ తదితర పరిశ్రమలలో విస్తృతంగా ఉపయోగపడుతోంది. గ్రీన్ ఎనర్జీ విప్లవంతో దీనిపై డిమాండ్‌ బలంగా పెరిగింది.

భౌగోళిక ఉద్రిక్తతలు:

మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులు, చైనాలో ఇన్వెస్ట్‌మెంట్‌ బలహీనత, అమెరికాలో ముడి ధరల పెరుగుదల వంటి అంశాలు ప్రపంచ వ్యాప్తంగా వెండిని సుర‌క్షిత పెట్టుబ‌డిగా మార్చాయి.

అంతర్జాతీయ మార్కెట్‌ ర్యాలీ:

2012 ఫిబ్రవరి తర్వాత తొలిసారి వెండి ధర ఔన్స్‌కు 37 డాలర్లను దాటడం మార్కెట్‌ను ఉత్సాహపరిచింది. ఇది భారత మార్కెట్‌లో వెండి రేట్లను పరుగులు పెట్టించింది.

45
కియోసాకి అంచనా నిజ‌మ‌వుతుందా.?

ముంబైకి చెందిన ప్రముఖ కమోడిటీస్ స్ట్రాటజిస్ట్ మీరా దేశ్ పాండే మాటల్లో చెప్పాలంటే, “వెండి రూ.2 లక్షలకు చేరాలంటే అది సాధారణ స్థితుల్లో సాధ్యంకాదు. దీని వెనుక తీవ్రమైన ఆర్థిక లేదా భౌగోళిక మార్పులు ఉండాలి.” అంటే కియోసాకి వ్యాఖ్యలు నిజం కావ‌డం అంత సుల‌భ‌మైన విష‌యం కాద‌ని అర్థం.

అయితే, అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్‌ బలహీనత, కేంద్ర బ్యాంకులు పెట్టుబడులను వెండిపైకి మళ్లించడం వంటి కీలక పరిణామాలు ఉంటే మాత్రం ఆ స్థాయికి వెండి చేరే అవ‌కాశం ఉంద‌ని మ‌రికొంద‌రు భావిస్తున్నారు.

55
బంగారం, వెండి ఏది కొనాలి.?

నిజానికి బంగారం ఇప్పటికే రూ.లక్ష దాటింది. కానీ ప్రస్తుతం లాభాల శాతం పరంగా వెండి వేగంగా పెరుగుతోంది. గత ఏడాది కాలంలో వెండి ధ‌ర‌లు దాదాపు 35% పెరిగాయి. ఇక ఈ ట్రెండ్‌ కొనసాగితే కియోసాకి ఊహించే స్థాయికి చేరే అవకాశాన్ని పూర్తిగా కొట్టివేయలేము.

Read more Photos on
click me!

Recommended Stories