అమెరికా, చైనాల మధ్య ఇంకా వార్ టారిఫ్ ఘర్షణ ముదిరేలా కనిపిస్తుండటం, స్టాక్ మార్కెట్లలో భారీ క్షీణత, డాలర్ ఇండెక్స్ సన్నగిల్లుతుండటం, అమెరికా ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న సంకేతాలు.. వెరసి పసిడి పరుగు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే నేడో, రేపో.. బంగారం రూ.లక్ష రూపాయలు దాటడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సమయంలో పెళ్లిళ్లు, శుభకార్యాలకు బంగారం కొనుక్కోవాలనుకుంటున్న సామాన్యులకు బంగారం అందనంత ధరలో ఉంటూ చుక్కలు చూపిస్తోంది.