RBI: ఆర్బీఐ పేరుతో నకిలీ లేఖలు పంపించి ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. రూ.1 లక్ష మీ ఖాతాలో జమ కావాల్సి ఉందని, కానీ ముందుగా రూ.7,500 పన్ను చెల్లిస్తే వెంటనే డబ్బు వస్తుందని చెబుతూ మోసగాళ్లు నకిలీ లేఖలను పంపిస్తున్నారు.
మోసగాళ్లు పంపుతున్న లేఖలో ఆర్బీఐ పేరు, లోగో, ముద్రను ఉపయోగించి నిజమైన లేఖలా కనిపించేలా తయారు చేశారు. అందులో మీ ఖాతాకు రూ.1,00,000 జమ కావాల్సి ఉందని, కానీ లావాదేవీ విఫలమైనందున ఆ మొత్తం నిలిపివేశామని పేర్కొన్నారు. ఆ డబ్బును విడుదల చేయాలంటే ముందుగా రూ.7,500 "రిఫండబుల్ ట్యాక్స్" చెల్లించాలని కోరుతున్నారు. ఆ మొత్తం చెల్లించిన 10 నిమిషాల్లో రూ.1,06,800 మీ ఖాతాలో జమ అవుతుందని కూడా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.
25
పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఏమి చెప్పింది?
ఈ లేఖ పూర్తిగా నకిలీదేనని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ వెల్లడించింది. ఆర్బీఐ ఎప్పుడూ వ్యక్తులకు ఇలాంటి లేఖలు పంపి పన్ను చెల్లించాలని కోరదని స్పష్టం చేసింది. ఇటువంటి మెసేజ్లు, లేఖలు లేదా సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను నమ్మవద్దని ప్రజలను హెచ్చరించింది. డబ్బు పంపాలని అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లించవద్దని సూచించింది.
35
ఇలాంటి మోసాలపై ఆర్బీఐ హెచ్చరిక
విదేశాల నుంచి భారీ మొత్తంలో డబ్బు వచ్చిందని, లాటరీ గెలిచారని లేదా చౌకగా విదేశీ నిధులు అందిస్తామని చెప్పి మోసం చేసే ఘటనలపై ఆర్బీఐ ఇప్పటికే పలుమార్లు ప్రజలను అప్రమత్తం చేసింది. ఇలాంటి సందేశాలు పంపేవారు ఆర్బీఐ పేరు, లోగోను దుర్వినియోగం చేసి అమాయకులను మోసం చేసే ప్రయత్నం చేస్తుంటారని తెలిపింది.
ఆర్బీఐ ప్రకారం వ్యక్తిగతంగా ఎవరికీ బ్యాంకు ఖాతాలు నిర్వహించదు. లాటరీ గెలిచారని లేదా విదేశాల నుంచి డబ్బు వచ్చిందని ఫోన్, ఎస్ఎంఎస్, ఈమెయిల్ లేదా లేఖ ద్వారా ఎప్పుడూ సమాచారం పంపదు. డబ్బు విడుదల కోసం పన్ను లేదా ఫీజు చెల్లించాలని కూడా కోరదు. అందువల్ల ఇలాంటి సందేశాలు వస్తే వెంటనే వాటిని నకిలీవిగా గుర్తించాలి.
⚠️Scam Alert!
🚨 A letter doing rounds on the internet reportedly issued by the Reserve Bank of India (RBI) claims that the recipient must pay a refundable tax amount of ₹7,500 to facilitate the release of a pending amount of ₹1,00,000. #PIBFactCheck:
ఆర్బీఐ పేరు చెప్పి డబ్బు అడిగే లేఖలు, సందేశాలు లేదా ఫోన్ కాల్స్ వస్తే వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు ఇవ్వకూడదు. ఇప్పటికే మోసపోయినట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేయాలి. అలాగే ఆర్బీఐ అధికారిక వెబ్సైట్ www.rbi.org.in మాత్రమే అసలైనదని గుర్తుంచుకోవాలి. దానికి పోలి ఉండే నకిలీ వెబ్సైట్లను నమ్మి వ్యక్తిగత వివరాలు లేదా డబ్బు ఇవ్వకూడదు.