ప్రస్తుతం బంగారం ధరలు చుక్కలు తాకుతున్నాయి. పోయిన ఏడాది ఈ సమయానికి సుమారు రూ. 70 వేలున్న తులం బంగారం ధర ఇప్పుడు ఏకంగా రూ. 88 వేలు దాటేసింది. మరికొన్ని రోజుల్లో తులం బంగారం ధర ఏకంగా రూ. లక్షకు చేరువయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే పెరుగుతోన్న ఈ బంగారం ధరలు ఒక మంచి వ్యాపార అవకాశాన్ని కల్పిస్తోంది.