ఈ స్కీమ్లో ఐదు సంవత్సరాల కాలాన్ని ఎంచుకుంటే మంచి లాభం పొందే అవకాశం ఉంటుంది. రూ.5 లక్షలు ఒకేసారి పెట్టుబడి పెడితే 7.5 శాతం వడ్డీ రేటుతో ఐదు సంవత్సరాల తర్వాత మొత్తం రూ.7,24,974 వస్తుంది. అంటే కేవలం వడ్డీ ద్వారానే రూ.2,24,974 లాభం లభిస్తుంది. స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి ఇది ఆకర్షణీయమైన ఆప్షన్.
ఒకవేళ రూ.10 లక్షలు డిపాజిట్ చేస్తే
పెట్టుబడి మొత్తం: రూ.10,00,000
కాలవ్యవధి: 5 సంవత్సరాలు
వార్షిక వడ్డీ రేటు: 7.5% లభిస్తుంది.
5 సంవత్సరాల తర్వాత వచ్చే మొత్తం వడ్డీ: రూ.4,49,948 (సుమారు) అవుతుంది. ఇక మెచ్యూరిటీ విలువ రూ.14,49,948 (సుమారు) అంటే కేవలం కేవలం వడ్డీ ద్వారానే దాదాపు రూ.4.5 లక్షలు లాభం పొందొచ్చు. అందులోనూ ఎలాంటి రిస్క్ లేకుండా, ప్రభుత్వ భద్రతతో ఈ రాబడి లభిస్తుంది