ఆ తర్వాతి నుంచి దేశవ్యాప్తంగా టాయిలెట్ల శుభ్రత పెంచేందుకు చర్యలు తీసుకున్నారు. రైళ్లలో నీటి సరఫరా మెరుగుపరిచింది. క్రమంగా, బయో-టాయిలెట్లు, ఆటోమేటిక్ ఫ్లషింగ్ సిస్టమ్ లాంటి సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ ప్రయాణికుడు రాసిన లేఖ ఇప్పటికీ పదిలంగా ఉంది. ఆ లెటర్ను న్యూఢిల్లీలోని రైల్వే మ్యూజియంలో భద్రంగా దాచి పెట్టారు. ఒక వ్యక్తి ఆలోచన, ఒక చిన్న లేఖ సమాజంలో ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదో చెప్పేందుకు ఇది ఒక నిదర్శనంగా చెప్పొచ్చు.