ఈ పథకం ద్వారా 5 లక్షల రూపాయల వరకు వ్యాపార రుణం వడ్డీ లేకుండా పొందవచ్చు. మహిళలకు వ్యాపార శిక్షణ కూడా అందిస్తారు. దీనికి అర్హత సాధించాలంటే మహిళలు స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉండాలి. 18 నుంచి 50 ఏళ్ల వయసు మధ్యలో ఉన్నవారు లఖ్పతి దీదీ పథకానికి అర్హులు.
ఈ పథకం ద్వారా మహిళలకు ఎల్ఈడీ బల్బుల తయారీలో శిక్షణ ఇస్తారు. పశుపోషణ, పుట్టగొడుగుల పెంపకం వంటి వివిధ రకాల శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తారు. తర్వాత వారికి ఆర్థిక నిర్వహణ, మార్కెటింగ్, ఆన్లైన్ వ్యాపారం, బిజినెస్కు సంబంధించిన శిక్షణను కూడా అందిస్తారు. ఈ స్కీమ్ ద్వారా మహిళలు ఆదాయ వనరుల్ని కల్పించుకునేందుకు, పెంచుకునేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.