ధనవంతులైతే భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి చూస్తారు. అయితే మిడిల్ క్లాస్, రోజు వారీ ఆదాయం సంపాదించే వారు భారీ స్థాయలో పెట్టుబడులు పెట్టలేరు. అలాంటి వారి కోసం SIP (సింపుల్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్) మంచి ఆలోచన అవుతుంది. అలాంటివే మ్యూచువల్ ఫండ్స్. మీరు కనుక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో నెలకు రూ.5,000 పెట్టుబడి పెడితే లాంగ్ టర్మ్ లో మంచి రాబడి పొందవచ్చు. దీనికి వడ్డీ రేటు కూడా భాగా వస్తుంది.
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో మీరు 12% వడ్డీ వృద్ధి రేటు పొందాలంటే కనీసం 20 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అంటే నెలకు రూ.5 వేలు చొప్పున 20 ఏళ్లు పెట్టుబడి పెడితే దాదాపు రూ.50 లక్షలు పొందవచ్చు. ఇందులో మీ పెట్టుబడి కేవలం రూ.12 లక్షలు మాత్రమే. మిగిలినదంతా లాభమే.
ఇదే ఈక్విిటీ మ్యూచువల్ ఫండ్స్ లో మీరు నెలకు రూ.10 వేలు చొప్పున 20 సంవత్సరాలు పెట్టుబడి పెడితే 12 శాతం వడ్డీరేటుతో మీరు రూ.1 కోటి రాబడిగా పొందవచ్చు.