36.6 లక్షల మందికి లబ్ధి..
2025 బడ్జెట్కు ముందు చర్చ సందర్భంగా EPS రిటైర్డ్ ఉద్యోగుల బృందం కనీస పెన్షన్ను రూ. 7,500కి పెంచాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను అభ్యర్థించింది. కానీ వారికి ఎటువంటి హామీ లభించలేదు.
ప్రస్తుతం EPS మొత్తం నిధులు రూ. 8 లక్షల కోట్లు. ఈ పథకం కింద దాదాపు 78.5 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. వీరిలో 36.6 లక్షల మందికి కనీస పెన్షన్ రూ. నెలకు 1,000. ఈ ప్రపోజల్ ఓకే అయితే వీళ్లందరికీ లబ్ధి చేకూరుతుంది.