గ్యాస్ సిలిండ‌ర్ నుంచి ఏటీఎమ్ వ‌ర‌కు, పాన్ కార్డు టూ క్రెడిట్ కార్డు.. మే1 నుంచి మార‌నున్న రూల్స్‌

Published : Apr 30, 2026, 06:16 AM IST

May 1st New Rules: అంత‌ర్జాతీయంగా మారుతోన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో మే నెల చాలా కీల‌కంగా మార‌నుంది. ఇందులో భాగంగానే మే 1వ తేదీ నుంచి ప‌లు మార్పులు చేస్తూ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇంత‌కీ రేప‌టి నుంచి ఏం మార‌నున్నాయంటే.

PREV
110
ఎల్పీజీ గ్యాస్‌ లో కొత్త మార్పులు

మే 1 నుంచి ఎల్పీజీ గ్యాస్ వ్యవస్థలో గణనీయమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం వల్ల దేశీయంగా గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గత రెండు నెలలుగా ధరలు పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి పెంపు ఉండవచ్చని భావిస్తున్నారు. ఇక గ్యాస్ సిలిండర్ బుకింగ్ విధానంలో కూడా మార్పులు రానున్నాయి. ఒకసారి సిలిండర్ బుక్ చేసిన తర్వాత మరోసారి బుకింగ్ చేయడానికి కనీసం 25 రోజుల గ్యాప్ తప్పనిసరి చేసే అవకాశముంది. అలాగే సిలిండర్ డెలివరీలో పారదర్శకత కోసం ఓటీపీ ఆధారిత వ్యవస్థను కచ్చితంగా అమలు చేయనున్నారు. వినియోగదారుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ ఇవ్వడం ద్వారా మాత్రమే సిలిండర్ అంద‌జేయ‌నున్నారు.

210
యూపీఐ, డిజిటల్ లావాదేవీల్లో కఠినతరం

డిజిటల్ చెల్లింపులు విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో భద్రతా ప్రమాణాలను మరింత కఠినతరం చేస్తున్నారు. మే 1 నుంచి యూపీఐ, నెట్ బ్యాంకింగ్ లావాదేవీలలో రెండు దశల ధృవీకరణ విధానం తప్పనిసరి అయ్యే అవకాశం ఉంది. అంటే ఓటీపీతో పాటు బయోమెట్రిక్ వెరిఫికేషన్ కూడా అవసరమవుతుంది. ఈ చర్యలు ముఖ్యంగా ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

310
ఏటీఎం లావాదేవీలపై ప్రభావం

బ్యాంకింగ్ రంగంలో కూడా వినియోగదారులను ప్రభావితం చేసే మార్పులు ఉండవచ్చు. కొన్ని బ్యాంకులు ఉచిత ఏటీఎం లావాదేవీల సంఖ్యను తగ్గించే అవకాశముంది. అలాగే నగదు ఉపసంహరణపై పరిమితులు విధించే అవకాశం ఉంది. నిర్ణయించిన పరిమితిని మించినప్పుడు అదనపు ఛార్జీలు విధించే అవకాశం ఉండటంతో వినియోగదారులు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.

410
పాన్ కార్డ్ నియమాలు కఠినతరం

పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలపై ప్రభుత్వం పర్యవేక్షణను పెంచుతోంది. సంవత్సరానికి రూ. 10 లక్షలకుపైగా డిపాజిట్ లేదా విత్‌డ్రా చేసే వారు తప్పనిసరిగా పాన్ కార్డు వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. దీనితోపాటు పాన్ కార్డు దరఖాస్తు విధానంలో కూడా మార్పులు తీసుకురావచ్చని సంకేతాలు ఉన్నాయి.

510
క్రెడిట్ కార్డ్ వినియోగంలో మార్పులు

క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు కూడా కొన్ని కొత్త నియమాలు అమల్లోకి రావచ్చు. ముఖ్యంగా బిల్లులు ఆలస్యంగా చెల్లించినప్పుడు వసూలు చేసే లేట్ ఫీజులు పెరగవచ్చు. అలాగే రివార్డ్ పాయింట్ల వినియోగంపై పరిమితులు విధించే అవకాశం ఉండటంతో వినియోగదారులు తమ ఖర్చులపై మరింత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.

610
రైల్వే టికెట్ రద్దు నిబంధనలు

ప్రయాణికులకు సంబంధించి రైల్వే శాఖ కూడా కొత్త మార్పులు తీసుకురానుంది. ట్రైన్ బయల్దేరే సమయానికి కనీసం 8 గంటల ముందు టికెట్ రద్దు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రద్దు చేస్తే రీఫండ్ పొందే అవకాశాలు తగ్గిపోవచ్చు. ఇది చివరి నిమిషంలో టికెట్ క్యాన్సిలేషన్‌ను తగ్గించేందుకు తీసుకున్న చర్యగా భావిస్తున్నారు.

710
సీఎన్జీ, పీఎన్జీ ధరలపై ప్రభావం

గ్యాస్ ధరల మార్పుల ప్రభావం సీఎన్జీ, పీఎన్జీ ధరలపైనా పడే అవకాశం ఉంది. ఇవి పెరిగితే రవాణా ఖర్చులు, గృహ వినియోగ వ్యయాలు పెరిగే అవకాశముంది. దీంతో సాధారణ ప్రజల నెలవారీ బడ్జెట్‌పై అదనపు భారం పడే అవకాశం ఉంది.

810
ఇన్సూరెన్స్ పథకాల ప్రీమియం ఆటో డెబిట్

ప్రభుత్వ ఇన్సూరెన్స్ పథకాలలో చేరిన వారికి మే నెలలో వార్షిక ప్రీమియం ఆటోమేటిక్‌గా బ్యాంక్ ఖాతా నుంచి కట్ అవుతుంది. ఖాతాలో సరిపడా బ్యాలెన్స్ లేకపోతే పాలసీ నిలిచిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల ముందుగానే ఖాతాలో డబ్బులు ఉంచుకోవడం అవసరం.

910
ఆన్‌లైన్ గేమింగ్ రంగంలో కొత్త నియమాలు

ఆన్‌లైన్ గేమింగ్ రంగాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం కొత్త చట్టాలను అమలు చేయడానికి సిద్ధమవుతోంది. గేమింగ్ సంస్థలపై పర్యవేక్షణ పెంచడం, గేమ్‌లకు సర్టిఫికేషన్ వ్యవస్థను కఠినతరం చేయడం వంటి మార్పులు ఉండవచ్చు. గేమ్‌ల చెల్లుబాటు గడువును కూడా పెంచే అవకాశం ఉంది.

1010
కేవైసీ అప్డేట్ అవసరం

బ్యాంక్ ఖాతాలు కలిగిన వారు తప్పనిసరిగా కేవైసీ వివరాలను అప్డేట్ చేసుకోవాలి. మే 1 తర్వాత అప్డేట్ చేయకపోతే బ్యాంక్ లావాదేవీలలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ వంటి సేవలు కూడా నిలిచిపోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories