కొల్లం-షెన్కోట్టై రైలు మార్గం చాలా చారిత్రాత్మకమైనది. దట్టమైన అడవులు, కొండలు, తేన్మల జలాశయం, పాలరువి జలపాతం, రోసమల గ్రామం వంటి ప్రసిద్ధ ప్రదేశాల మీదుగా ఈ రైలు వెళుతుంది. చాలా తక్కువ ధరకే వందే భారత్ ఎక్స్ప్రెస్లో మీరు ఈ ప్రదేశాలన్నీ చూడొచ్చు.
ఈ మార్గంలో ప్రయాణించే వందే భారత్ రైలుకు మంత్లీ పాస్ కూడా ఇస్తారు. అంతే కాకుండా అత్యాధునిక సదుపాయాలను రైల్వే డిపార్ట్ మెంట్ అందిస్తోంది. ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. తక్కువ సమయంలో గమ్యస్థానానికి కూడా చేరుస్తుంది. ఈ వందే భారత్ ట్రైన్ ద్వారా కేవలం రూ.30 లకు అనేక పర్యాటక ప్రదేశాలను చూడొచ్చు.