కొద్దికొద్దిగా బంగారం కొని పెట్టుకొంటే అత్యవసర అవసరాలకు బంగారం అమ్ముకుని డబ్బు అరేంజ్ చేయవచ్చు. పిల్లల చదువు, పెళ్లిళ్లకు బంగారంలో పెట్టుబడి పెడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పుడు కొత్తగా డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్ మెంట్ కూడా వచ్చేసింది. గోెల్డ్ రేట్స్ కి బట్టి షేర్స్ కొంటే అవి ధరలకు అనుగుణంగా పెరుగుతాయి. దీంతో కేవలం రూ.10 నుంచి కూడా పెట్టుబడి పెట్టొచ్చు.
2010లో ఒక తులం బంగారం రూ.10,000 మాత్రమే ఉండేవి. ఇప్పుడు బంగారం ధరలు చారిత్రాత్మక గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. దీపావళి రోజున అక్టోబర్ 31న ఒక తులం బంగారం రూ.59,640కి చేరుకుంది. ఈ ధరలు ఇంకా పెరుగుతాయని అందరూ భావించారు.