రూ.45 నుంచి రూ.25 లక్షల నిధిని ఎలా పొందుతారు?
ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీ కింద మీరు నెలకు సుమారుగా రూ. 1358 పెట్టుబడి పెట్టడం ద్వారా రూ. 25 లక్షల కార్పస్ను కూడబెట్టుకోవచ్చు. అంటే రోజుకు చూసుకుంటే రూ.45 మాత్రమే పెట్టుబడి పెడితే మీకు భారీ ఫండ్ అందుతుంది. అయితే, మీరు ఈ పొదుపును కొంత ఎక్కువ సమయం చేయాల్సి వుంటుంది. ఈ పథకంలో మీరు రోజూ రూ. 45ల సెవింగ్స్ చేస్తూ 35 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీ సమయంలో మీరు రూ. 25 లక్షల మొత్తాన్ని పొందుతారు.
జీవన్ ఆనంద్ పాలసీతో ఇంకా చాలానే ప్రయోజనాలు ఉన్నాయి
ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీలో 35 ఏళ్లపాటు ప్రతి సంవత్సరం రూ.16,300 ఇన్వెస్ట్ చేస్తే మొత్తం డిపాజిట్ మొత్తం రూ.5,70,500 అవుతుంది. ఈ పాలసీ ప్రకారం మీ ప్రాథమిక హామీ మొత్తం రూ. 5 లక్షలు. మెచ్యూరిటీ వ్యవధి తర్వాత రూ. 8.60 లక్షలు రివిజనరీ బోనస్గా, రూ. 11.50 లక్షలు తుది బోనస్గా అందుకుంటలారు. ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీలో బోనస్ రెండుసార్లు అందిస్తారు. అయితే దీని కోసం మీ పాలసీ వ్యవధి తప్పనిసరిగా 15 సంవత్సరాలు ఉండాలి.