అర్జెంట్‌గా బంగారం కొనేయండి: 2025లో ధర ఎంత పెరుగుతుందో మీరు ఊహించలేరు

First Published Oct 17, 2024, 12:10 PM IST

బంగారం వెంటనే కొని పెట్టుకోండి. ఎందుకంటే భవిష్యత్తులో గోల్డ్ ధర ఎంతలా పెరుగుతుందంటే.. మీరు కనీసం ఊహించలేరు. అందుకే అర్జెంట్ గా బంగారం కొనేసుకోండి. గోల్డ్ ధరల హెచ్చుతగ్గుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ స్టోరీ పూర్తిగా చదవండి. 
 

2024 చివరి నాటికి బంగారం ధరలు ఔన్సుకు 2,750 US డాలర్ కి పెరుగుతాయని UBS(union bank of switzerland) అంచనా వేసింది. సెంట్రల్ బ్యాంకుల ద్వారా పెరిగిన బంగారం కొనుగోళ్ల ఆధారంగా  UBS ఓ నివేదిక ప్రచురించింది. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల ఆధారంగా ఈ నివేదర రూపొందించారు. దేశాల మధ్య రాజకీయ యుద్ధాలు కూడా బంగారం ధరలపై ప్రభావాన్ని చూపనున్నాయి. 2025లో బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంటాయని నిపుణులు భావిస్తున్నారు.
 

2025లో బంగారం ధర ఎంత ఉంటుందంటే..

UBS నివేదిక ప్రకారం 2024 చివరి నాటికి బంగారం ధరలు ఔన్సుకు 2,750 డాలర్లకు చేరుకోవచ్చని అంచనా. అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.2.30 లక్షలు అన్నమాట. బంగారంపై పెట్టుబడులకు పెరుగుతున్న డిమాండ్ ఓ కారణం అయితే, US డాలర్  బలహీనపడుతుండటం మరో కారణంగా తెలుస్తోంది. వీటికి తోడు పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ ఆందోళనలు కూడా ఈ సంవత్సరం బంగారం 29 శాతం పెరుగుదలకు కారణమయ్యాయి. 2025 మధ్యలో బంగారం ఔన్స్‌కి 2,850 డాటర్లు అవుతుందని, 2025 మూడవ త్రైమాసికంలో 2,900 డాలర్లకు పెరుగుతుందని UBS అంచనా వేసింది. ఈ లెక్క ప్రకారం ఇండియన్ కరెన్సీలో బంగారం ధరలు ఔన్స్ కి రూ.2.39 లక్షల నుంచి రూ.2.43 లక్షల మధ్య ఉండవచ్చు.

Latest Videos


బంగారంపై పెట్టుబడి

రాబోయే నెలల్లో మెటల్ గోల్డ్ కొనుగోళ్లకు డిమాండ్ పెరగనుందని, ముఖ్యంగా ETF డిమాండ్ వేగవంతం అవుతోందని UBS అభిప్రాయపడింది. అయితే చైనాలో మాత్రం బంగారం డిమాండ్ తగ్గుతున్నట్లు సంకేతాలు ఉన్నాయి. యూఎస్బీ బ్యాంకు బంగారం పెట్టుబడిపై 5 శాతం కేటాయింపును సిఫార్సు చేస్తోంది. విభిన్నమైన US డాలర్-డినామినేటెడ్ పోర్ట్‌ఫోలియోలో బంగారాన్ని మూలాధార హెడ్జ్‌గా బ్యాంక్ సిఫార్సు చేస్తూ కొనుగోలుదారులను ఎంకరేజ్ చేస్తోంది. 

2025లో ఆల్ టైమ్ హై రేటు 

UBS గోల్డ్ మైనర్లను ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశంగా చెబుతోంది. 2025 ప్రారంభంలో బంగారం ఆల్ టైమ్ ఎక్కువ ధరను నమోదు చేస్తుందని చెబుతోంది. వివిధ దేశాల కరెన్సీలో  హెచ్చుతగ్గులు ఓ కారణం కాగా, టర్కీ, సింగపూర్, బ్రెజిల్, భారతదేశం వంటి దేశాలు కూడా తమ నిల్వలను పెంచుకోవడం కారణమని  వెల్లడించింది. 2025 ప్రారంభంలో బంగారం ధరలు ఆల్ టైమ్ హైకి చేరుకుంటాయని డెవెరెక్స్ గ్రూప్ సీఈవో చెప్పారు.
 

గ్లోబల్ సెంట్రల్ బ్యాంకులు మంచి రేటు ఇస్తూ బంగారం కొనుగోళ్లను పెంచుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ వివాదం తర్వాత ఇది ప్రారంభమైంది. బంగారం కొనుగోళ్లు 2022కి ముందు ఉన్న స్థాయిల కంటే ఇప్పుడు దాదాపు మూడు రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఔట్‌లుక్ 2025లో బలమైన డిమాండ్‌ను కొనసాగించడాన్ని సూచిస్తుందని ఆర్థికవేత్తలు చెప్పారు. 2023లో చైనా సెంట్రల్ బ్యాంక్ వరుసగా 10 నెలల బంగారు నిల్వలను జోడించింది.

బంగారం ధరలు పెరగడానికి కారణాలు

పశ్చిమ దేశాలతో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు డాలర్‌పై ప్రభావం చూపుతున్నాయి. దీంతో డాలర్ పై ఆధారపడటాన్ని తగ్గించడం లక్ష్యంగా కొన్ని దేశాలు బంగారం నిల్వలను పెంచుకోవడానికి చర్యలు తీసుకుంటున్నాయి. US ఫెడరల్ రిజర్వ్ దూకుడు వడ్డీ రేట్ల పెంపును రద్దు చేసింది. వాణిజ్య యుద్ధాలు, ఆంక్షలు, పెరుగుతున్న ప్రపంచ ఉద్రిక్తతలతో సహా భౌగోళిక రాజకీయ అసమానతలు బంగారం ధరలపై ప్రభావం చూపనున్నాయి. 
 

సెంట్రల్ బ్యాంకుల ప్రభావం 

ముఖ్యంగా సెంట్రల్ బ్యాంక్ స్వాతంత్ర్యం, ప్రపంచ రుణ స్థిరత్వం, ఆర్థిక ఆంక్షలు వంటి సమస్యలపై ఆందోళనలు పెరగడంతో బంగారం ధర పెరుగుతూనే ఉందని చెప్పవచ్చు. అందువల్ల 2025లో బంగారం ధర ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని, అందుకే బంగారం కొనుగోలు చేసి పెట్టుబడులు పెట్టిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
 

click me!