శివ్ నాడార్ కూతురు రోష్ని నాడార్ HCL ఎంటర్ప్రైజెస్ CEOగా వ్యవహరిస్తున్నారు. ఈమె నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీలో కమ్యూనికేషన్ చదివారు. కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుండి MBA పట్టా పొందారు. శివ్ నాడార్ వారసురాలుగా వార్తల్లో నిలిచారు.
USV ఇండియా ఛైర్ పర్సన్ లీనా గాంధీ తివారీ కూడా బికాం పట్టా పొందారు. బోస్టన్ యూనివర్సిటీ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ డిగ్రీ పొందారు.
గోద్రేజ్ ఫ్యామిలీకి చెందిన స్మితా కృష్ణ ముంబైలోని జె.బి. పెటిట్ స్కూల్ లో చదువు పూర్తి చేశారు. సెయింట్ జేవియర్స్ కాలేజీ నుండి పొలిటికల్ సైన్స్, హిస్టరీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.