Salary: ఉద్యోగులకు పండగలాంటి వార్త.. ఏప్రిల్‌ నుంచి ప్రతీ ఒక్కరికీ పెరగనున్న జీతాలు. ఎంతో తెలుసా.?

Published : Apr 01, 2025, 10:57 AM ISTUpdated : Apr 01, 2025, 11:02 AM IST

ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే  ప్రభుత్వ నిబంధనల్లో కొన్ని మార్పులు జరగనున్నాయి. వీటిలో ఉద్యోగుల జీతం పెరగడం ఒకటి. సంవత్సర ఆదాయం 12 లక్షలు దాటితేనే పన్ను చెల్లించే విధానం అమల్లోకి రానుంది. దీంతో ఆదాయపు పన్ను భారం తగ్గుతుండడంతో ఉద్యోగుల జీతం పెరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

PREV
17
Salary: ఉద్యోగులకు పండగలాంటి వార్త.. ఏప్రిల్‌ నుంచి ప్రతీ ఒక్కరికీ పెరగనున్న జీతాలు. ఎంతో తెలుసా.?

ఏప్రిల్ నెల నుంచి చాలా ప్రభుత్వ నియమాలు మారుతున్నాయి. బ్యాంకుల నియమాలు కూడా మారుతున్నాయి. ఇందులో ప్రధానమైంది పన్ను చెల్లింపులు కూడా.   రూ. 12 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న వారిని పన్ను నుంచి మినహాయిస్తూ కేంద్ర నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఇది ఉద్యోగుల జీతాలపై ప్రభావం చూపనుంది. 

27

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఈ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఏప్రిల్ నెల నుంచి ఉద్యోగుల జీతాలు పెరగనున్నాయి. మీరు పనిచేసే కంపెనీ మీ జీతాలను పెంచకపోయినా మీ శాలరీ పెరగనుందన్నమాట. 

37

అదనంగా వచ్చే ఈ జీతం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పన్ను మినహాయింపు విధానం ద్వారా అందనుంది. కొత్త రూల్స్ ప్రకారం, కొత్త ఆర్థిక సంవత్సరంలో రూ. 12 లక్షలపై జీతం ఉన్న వాళ్లు మాత్రమే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 

47

అలాగే రూ. 12 లక్షల పైన స్టాండర్డ్ డిడక్షన్ 75 వేలు అవుతుంది. కాబట్టి రూ. 12.75 లక్షలు ఆదాయం ఉన్నవాళ్లు కూడా ఎలాంటి పన్ను చెల్లించాల్సిన పని ఉండదు. ఈ మిగిలిన మొత్తం ఉద్యోగులకే లభించనుందన్నమాట. 

57

ఉద్యోగుల జీతాలపై ఆదాయపు పన్ను లేకపోవడంతో ప్రతి నెల మీ జీతం ఆటోమెటిక్ గా పెరగనుంది. ఇందుకోసం కంపెనీలు ప్రత్యేకంగా జీతాలు పెంచాల్సిన కూడా లేదు. అయితే సహజంగా ఏప్రిల్ లో కంపెనీలు ఉద్యోగుల జీతాలు పెంచుతాయి. దీంతో ఈసారి ఉద్యోగుల జీతాలు గతంలో కంటే ఎక్కువ పెరగనున్నాయి. 

67

రూ. 7 నుంచి 12 లక్షలు ఆదాయం ఉన్నవాళ్లు నెలకు రూ.6,600 అదనంగా పొందుతారు. ట్యాక్స్ చెల్లించాల్సిన పని లేకపోవడంతో ఉద్యోగుల జీతాలు సహజంగానే పెరుగుతాయి. 

77

ఇదిలా ఉంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి టీడీఎస్ తక్కువగా కట్ అవుతుంది. దీని వల్ల అందరి అకౌంట్లోకి ఎక్కువ డబ్బులు జమకానున్నాయి. మొత్తం మీద ఈ కొత్త ఆర్థిక సంవత్సరం ఉద్యోగులకు కలిసొస్తుందని ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కొత్త నిబంధనలన్నీ ఏప్రిల్ నెల నుంచే అమలులోకి వస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories