షేర్లు, మ్యూచువల్ ఫండ్స్..
షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, డిబెంచర్లు లేదా బాండ్లు కొనుగోలు చేయడానికి అధిక మొత్తంలో నగదు ఉపయోగించినా ఆదాయపు పన్ను శాఖకు సమాచారం అందుతుంది. ఒక వ్యక్తి రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీ చేస్తే, ఆ సమాచారం ఆదాయపు పన్ను శాఖకు చేరుతుంది. అలాంటప్పుడు, మీరు డబ్బును ఎక్కడి నుండి తెచ్చారో ఆదాయపు పన్ను శాఖకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.