వచ్చే 10 ఏళ్లలో డిసెంట్రలైజేడ్ ఫైనాన్స్ (DeFi) రంగంలో అనివార్యమైన మార్పులు వస్తాయని అంబానీ సూచించారు. DeFi అనేది బ్లాక్చెయిన్-ఆధారిత ఫైనాన్స్, ఇది బ్రోకరేజ్లు, స్టాక్ ఎక్స్ఛేంజీలు లేదా ఫిజికల్ బ్యాంక్లు లేకుండా పనిచేయగలదు.
డేటా ప్రైవసీ బిల్లు అండ్ క్రిప్టోకరెన్సీ బిల్లును ప్రవేశపెట్టేటప్పుడు దేశం సరైన మార్గంలో ఉందని ముకేష్ అంబానీ చెప్పారు. క్రిప్టోకరెన్సీ నుండి వచ్చే లాభాలపై పన్ను విధించడాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నప్పటికీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ కరెన్సీలపై పూర్తి నిషేధాన్ని కోరుతోంది.
“డేటా అండ్ డిజిటల్ మౌలిక సదుపాయాలు భారతదేశానికి అలాగే ప్రపంచంలోని ప్రతి ఇతర దేశానికి వ్యూహాత్మకంగా ముఖ్యమైనవి. ఈ వ్యూహాత్మక డిజిటల్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ నిర్మించడానికి, రక్షించడానికి ప్రతి దేశానికి హక్కు ఉంది, ”అని ముకేష్ అంబానీ అన్నారు,